Wednesday, January 20, 2021

భగవద్గీత గురించి - if you know the value

 ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది.


ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందిన వారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా.


మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?


అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు.


నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.


వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు.


ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది.


నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను.


అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను.


అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు:- మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? 


ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.


సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించు కుంటారు.


మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు.


ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి. ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు.


ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు.


మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే.


మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది.


కానీ, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం కాలేదు.


మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండ వాళ్ళం.


మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను ఎప్పుడో ఒక సారి ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన Show Case లో భద్రంగా పెడుతున్నాం.


ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం.


సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత.


చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతితో అతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత.


ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత.


ఎన్నో వ్యాధులకు మందు రామాయణ,మహాభారత భగవద్గీత లలో ఉన్నాయి.


దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.


గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవమునకు విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత.


ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడ్డ గ్రంథం భగవద్గీత.


ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించ బడుతున్న గ్రంథం భగవద్గీత.


ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత.


 దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి, అర్థం చేసుకొని, దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.