Thursday, March 30, 2017

మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం

✍�అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:

🔸ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో అబ్దుల్ కలాం గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.

🔸ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ..........., భోజనానికి రమ్మని....... ఆమె పిలవడంతో
అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం చేయడానికి సిద్దపడ్డారు.

🔸తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన
అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని ............, మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.

🔸కానీ ఆయన ఆ రొట్టెలను తిని........., ఆమెను ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయాడు.

🔸కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు వెళ్ళి........ “ రొట్టెలు మాడిపోయినందుకు క్షమించమని.......” కోరింది. వెంటనే ఆయన, “ నాకు మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం..... “ అని ఎంతో ప్రేమగా ఆమెతో అన్నారు.

🔸ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు, కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి “మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత ఇష్టమా.....? అని అడిగారు.

🔸ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ......, “ మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో
అలసిపోయింది.

🔸అంత అలసటలో కూడా విసుగు లేకుండా వంట చేసింది.

🔸ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ కాదు.

🔸 కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని విమర్శిస్తే........, ఆమె మనసు ఎంతగానో బాధ పడుతుంది.

🔹అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.

🔸జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజం.

🔸ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం మంచిది కాదని........” ఆయన అన్నారు.

🔹ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం,  ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి.

🔹బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను కొనసాగించండి